వివాహేతర సంబంధం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకోవడమే కాకుండా, పోలీసుల రక్షణలో ఉన్న మహిళను కూడా కాపాడలేకపోయిన దారుణ ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. ప్రియుడితో వెళ్లిపోయిన భార్యను భర్త కత్తితో పొడిచి హతమార్చాడు.
అసలేం జరిగిందంటే.. జహీరాబాద్కు చెందిన సిద్ధారెడ్డి, కవిత (29) దంపతులు. అయితే కవితకు పవన్ రెడ్డి అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. ఈ క్రమంలోనే మార్చి 27న కవిత తన ప్రియుడు పవన్ రెడ్డితో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయింది. దీనిపై మార్చి 30న భర్త సిద్ధారెడ్డి జహీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేశారు.
పోలీసుల కారులోనే హత్య: దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు, కవిత జడ్చర్లలో ప్రియుడు పవన్ రెడ్డితో ఉన్నట్లు గుర్తించారు. ఆమెను జహీరాబాద్కు తీసుకురావడానికి పోలీసులు వెళ్తుండగా, భర్త సిద్ధారెడ్డి కూడా వారితో కలిశాడు. పోలీసు వాహనంలో తిరిగి వస్తుండగా.. సదాశివపేట మండలం నందికంది వద్దకు రాగానే సిద్ధారెడ్డి తన వెంట తెచ్చుకున్న కత్తితో ఒక్కసారిగా భార్య కవిత గొంతులో పొడిచాడు.
ఆసుపత్రికి తరలించేలోపే.. తీవ్ర రక్తస్రావం కావడంతో పోలీసులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. కానీ, గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో కవిత మార్గమధ్యలోనే మృతి చెందింది. పట్టపగలు, పోలీసుల వాహనంలోనే ఈ హత్య జరగడం జిల్లాలో తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి సిద్ధారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.
ప్రియుడితో వెళ్లిపోయిన భార్యను కత్తితో పొడిచి హత్య చేసిన భర్త
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో వివాహేతర సంబంధం పెట్టుకొని వెళ్లిపోయిన భార్య కవిత(29)ను హత్య చేసిన భర్త సిద్ధారెడ్డి
మార్చి 27న ప్రియుడు పవన్ రెడ్డితో వెళ్లిపోయిన కవిత.. మార్చి 30న జహీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసిన… pic.twitter.com/mZb789k8GO
— Telugu Scribe (@TeluguScribe) April 6, 2026